(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో ఎన్డీఎస్ ఏ పేరు చెప్పి రాష్ట్ర ప్రబుత్వం కాలక్షేపం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేశామంటూ నిర్మించిన ఈ ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని చెప్పారు. ప్రాజెక్టు పునరుద్ధరించడానికి NDSA సిఫార్సులను సకాలంలో అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో ఈ ప్రాజెక్టు నుండి తాగునీటి మరియు సాగునీటి అవసరాలకు నీటి సరఫరా లేకపోవడం వల్ల రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

గత ప్రభుత్వం చేసిన తప్పుడు డిజైన్, నిర్మాణం కారణంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2023 అక్టోబర్లో వినియోగించుకునే అవకాశం లేకుండా పోయాయన్నారు.బీఆర్ ఎస్ నిర్మాణం చేసిన ఘనత ప్రపంచానికి ఆనాడే తెలిసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం అసమర్ధతత అందరూ చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే NDSA అనేక పలు నివేదికలను ఇచ్చిందని, వాటి అమలు గురించి సర్కార్ ఏ మాత్రం పట్టించుకోలేదని రాంచందర్ రావ్ ఆరోపించారు.












Leave a Reply