NewsInn

News in a Click

రెచ్చ‌గొట్ట‌డం…ల‌బ్ది పొంద‌డం వారికి అల‌వాటు

రెచ్చ‌గొట్ట‌డం…ల‌బ్ది పొంద‌డం వారికి అల‌వాటు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా ఉద్య‌మ స‌మ‌యం నుంచి రెచ్చ‌గొట్ట‌డం, ల‌బ్ది పొంద‌డం బీఆర్ ఎస్ నేత‌ల‌కు అల‌వాట‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిజాలు చెబుతున్నా….వాటిని త‌ప్ప‌ని చెప్పే ప్ర‌య‌త్నాలు బీఆర్ఎస్ నేత‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ఆరోప‌ణ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ధీటైన స‌మాధానం ఇస్తున్నార‌ని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక‌పై బ‌హిరంగంగా చ‌ర్చించేందుకు కేసీఆర్, హ‌రీష్ లు ముందుకు వ‌స్తారా అని జ‌గ్గారెడ్డి స‌వాల్ చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో కూడా తెలంగాణా ఉద్య‌మ‌కారుల‌ను రెచ్చ‌గొట్టేందుకు హ‌రీష్ రావ్ ప్ర‌య‌త్నించిన విష‌యాన్ని జ‌గ్గారెడ్డి గుర్తు చేశారు. పెట్రోల్ పోసుకునే వ్య‌క్తితి అగ్గిపెట్టె ఎలా దొర‌క‌ద‌ని ప్ర‌శ్నించారు. ఇలాంటి సీన్లు క్రియేట్ చేయ‌డంతో ఎంతో మంది యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌న్నారు. ఆ ల‌బ్దిని తెలంగాణా వాదం ముసుగులో బీఆర్ఎస్ సొంతం చేసుకుంద‌న్నారు. ఇప్పుడు కాళేశ్వ‌రం విష‌యంలో అదే వ్యూహాన్ని బీఆర్ ఎస్ అమ‌లు చేస్తోంద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో హైక‌మాండ్ అదేశాల‌కు అనుగుణంగానే తాను సంగారెడ్డి మిన‌హా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *