(అమరావతి,న్యూస్ఇన్)
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుడిభుజం శస్త్ర చికిత్స అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. ముంబాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసుపత్రికి పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు వెళ్లారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో, ఆయన సతీమణి కొణిదలతో ప్రత్యేకంగా మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులతోనూ చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వద్దనే మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘ఏళ్ల తరబడి రెండు భుజాలకు ఉన్న తీవ్రమైన గాయాలను ప్రజా సేవలో నిమగ్నమై శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదని, పర్యటనల సమయంలో ఆయన మీదకు అభిమానులు ఆప్యాయంగా దూసుకురావడం, చేతులు పట్టుకొని పక్కకు లాగడం, తోపులాట వల్ల భుజాలకు ఉన్న సమస్య తీవ్రమైందన్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని సూచన చేయడంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింద్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉందన్నారు.పవన్ కళ్యాణ్ గారు మునుపటి ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలోకి తిరిగి వస్తారన్నారు. మరో ఆరు నెలల తరువాత రెండో భుజానికి శస్త్ర చికిత్స జరిగే అవకాశం ఉంది.












Leave a Reply