NewsInn

News in a Click

క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

బీజేపీలో ఎవ‌రు క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద‌ర్ రావ్ హెచ్చ‌రించారు. పార్టీ ఆశ‌యాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌నా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ఎవ‌రు పార్టీ లైన్ దాటినా వేటు వేస్తామ‌న్నారు.గ్రేట‌ర్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మూడు కార్పొరేషన్లపై బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, జీహెచ్ఎంసీ ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఈరోజు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివేకానంద కాలనీలో బిజెపి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్వం మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన హన్మంతరావు పార్టీ కోసం విరాళంగా ఇచ్చిన స్థలంలోనే ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించడం జరిగింద‌న్నారు. ప్రస్తుతం ప్రజలంతా బిజెపి వైపు ఆశగా చూస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో బిజెపి జెండా ఎగరడం ఖాయమన్నారు.

నగరంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని మండిపడ్డారు. నగరంలో ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి ఉందని, వర్షాకాలం వచ్చేలోపు వరద ముంపు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని బిజెపి హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘ఎల్ నినో’ ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, పడిన చిన్నపాటి వానలకే నగరం జలమయమై ట్రాఫిక్ స్తంభిస్తోందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఎంఐఎం (MIM) తో దోస్తీ చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *