NewsInn

News in a Click

జైలుకు వెళ్లాల‌ని ఉందా – ఆలోచించండి…!

జైలుకు వెళ్లాల‌ని ఉందా – ఆలోచించండి…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

స‌మాజంలో ఎంతో మంది నేరస్తులు నేర పూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి జైలు శిక్ష‌ను అనుభ‌విస్తుంటారు. ఈ జైలు జీవితం గురించి, జైలు క్ర‌మ‌శిక్ష‌ణ గురించి తెలంగాణా జైళ్ల శాఖ జైలు అనుభ‌వం పేరుతో ఆస‌క్తి ఉన్న వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. జైలు జీవితం గురించి తెలుసుకోవ‌డం..అనుభ‌వించ‌డం అతి త‌క్కువ మందికే అవ‌కాశం క‌లుగుతుంది. జైలుకు వెళ్లి వచ్చారంటే స‌మాజంలో ఇంకా చిన్న చూపు ఉండ‌నే ఉంది. నేరుస్తులు మాత్ర‌మే జైళ్ల‌కు వెళుతార‌న్న అభిప్రాయం ఉంది. ఈ జైలు జీవితాన్ని రుచి చూడాలని ఆస‌క్తి ఉంటే… జైళ్ల‌ శాఖ అవ‌కాశం క‌ల్పించాని నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో ఇప్పటి వ‌ర‌కు ఐదు జైళ్ల‌లో మాత్ర‌మే ఇలాంటి జైలు జీవితం అనుభవించే చాన్స్ ఉంది. తెలంగాణా జైళ్ల శాఖ జైలు జీవితం అనుభ‌వించాల‌ని ఎవ‌రికి ఆస‌క్తి ఉన్నా…. వారు ఈ అవాకశాన్ని వినియోగించుకోవ‌చ్చు. చంచల్ గూడ జైల్లో ఇందుకు సంబంధిచి బ్యార‌క్ లు ఏర్పాటు చేశారు. పురుషులు, మ‌హాళ‌ల‌కు వేర్వే బ్యార‌క్ ల‌ను ఏర్పాటు చేయ‌డంతో… పాటు విఐపీ బ్యార‌క్ ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశారు. రిమాండ్ లో ఉన్న వారితో పాటు జైలు జీవితం అనుభ‌విస్తున్న వారిని ఈ శాఖ ఎలా చూస్తోందో… ఆస‌క్తితో జైలు జీవితాన్ని అనుభ‌వించాల‌ని కోరుకున్న వారికి అలాంటి స‌దుపాయాలే క‌ల్పిస్తారు. జైలులో ఉండే వారికి ఇచ్చే ఆహారం వారిని క‌ల్పించే సౌక‌ర్యాలు వీరికి క‌ల్పిస్తారు. ఆస‌క్తి ఉంటే చంచ‌ల్ గూడ‌లోని జైలుకు వెళ్లి ఎలాంటి నేరం చేయ‌క పోయినా…జైలు జీవితాన్ని అనుభ‌వించి రావ‌చ్చు. కానీ ప్రభుత్వం నిర్ణ‌యంచిన ఫీజులు చెల్లిస్తేనే ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోనే అవ‌కాశం ద‌క్కుతుంది.

జైలు అనుభ‌వాల‌ను పంచుకున్న గ‌వ‌ర్న‌ర్

జైలు అనుభ‌వం బ్యార‌క్ ల ను గ‌వ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా ప్రారంభించారు. అనంత‌రం బ్యారెక్ ల‌ను ప‌రిశీలించారు. ఫీల్ ద జైలు ను ప‌రిశీలించి…జైల్లో త‌న స్వ‌యం అనుభబాల‌తో పాటు జైళ్ల శాఖ మంత్రి తాను తెచ్చిన సంస్క‌ర‌ణ‌ల‌ను వెల్ల‌డించారు. ఉద్య‌మాల్లో పాల్గొన్న స‌మ‌యంలో తాను 19 నెల‌ల 20 రోజుల పాటు జైల్లో ఉన్నాన‌ని గుర్తు చేసుకున్నారు. అనూహ్యంగా తాను ఎమ్మెల్యే అయిన త‌రువాత తొలిసారి జైళ్ల శాఖ‌కు మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించే అవ‌కాశం వ‌చ్చింద‌ని ఈ స‌మ‌యంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో అమ‌లు చేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు. క‌ళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అక్క‌డి జైళ్ల‌లో ఫ్యాన్లు, టీవీ వంటివి ఏర్పాటు చేసి న‌ట్లు వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి దీనికి అంగీక‌రించ‌క‌పోయినా….ప‌ట్టుబ‌ట్టి ఒప్పించాన‌న్నారు. తెలంగాణా జైళ్ల శాఖ జైలు జీవితం గురించి ఇలాంటి కార్య‌క్ర‌మం తీసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. నిజాం పాలన కాలంలోని జైలు లు , నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో ఖైదీల పాత్ర, దాశరథి , రామదాసు లను బంధించిన జైలు నమూనాలు, ఖైదీల్లో మార్పు కోసం తీసుకున్న చర్యలు, జైలు ఉత్పత్తులు, జైలు కార్యకలాపాలను గవర్నర్ పరిశీలించారు.ఈ జైల్ మ్యూజియం భవిష్యత్తులో పర్యాటక ఆకర్షణగా మాత్రమే కాకుండా విద్య, పరిశోధన, సామాజిక చైతన్యానికి ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్…..

తెలంగాణా జైళ్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన పీల్ జైల్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా …. జైళ్ల శాఖ గురించి తెలియ‌చేసే మ్యూజీయంలోకి మీడియాను అనుమ‌తించ‌క‌పోవ‌డంపై గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్ అయ్యారు. గ‌తంలో జైళ్ల‌లో ఉన్న ప‌రిస్థితులు ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చిన ప‌రిస్థితులుపై మీడియాకు అవ‌గాహ‌న‌ క‌ల్పించ‌క‌పోతే బ‌య‌టి ప్ర‌పంచానికి ఎలా తెలుస్తుంద‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. దీంతో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం పూర్త‌యిన త‌రువాత ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించుకోవ‌చ్చని అధికారులు మీడియా ప్ర‌తినిధుల‌కు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *