
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ జలమండలి మేనేజర్ అనంత లక్ష్మికుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఆదాయినికి మించి ఆస్తులు ఆయన దగ్గర అధికారులు గుర్తించారు.మల్లాపూర్ లోని ఆయన నివాసంతో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కోటి పది లక్షల నగదుతో పాటు సుమారు కిలో బంగారు అభరణాలు గుర్తించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి కూడా ఉందని ఏసీబీ గుర్తించింది. ఇంకా భారీగానే ఆస్తులు ఉన్నాయని, బ్యాంక్ లాక్సర్స్ ఇంకా తెరువాల్సి ఉందని అధికారులు తెలిపారు.










Leave a Reply