(న్యూస్ఇన్, హైదరాబాద్)
రాష్ట్రంలో పన్నీర్ మాదిరిగానే తయారు చేసే కృత్రిమ పన్నీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. అసలైన పన్నీర్ను పోలి ఉండే ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించకుండా తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(ఏ) కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 10న గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 807 జారీ చేసినట్లు సమాచారం.కృత్రిమ పన్నీర్ తయారీకి మాత్రమే కాకుండా ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపైనా నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తక్కువ ధరతో మార్కెట్లోకి..

నాన్ డెయిరీ పన్నీర్ సాధారణ పాల పన్నీర్తో పోలిస్తే తక్కువ ధరకు లభించడం, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కృత్రిమ పదార్థాలతో తయారైన ఉత్పత్తులను పాలతో తయారు చేసిన పన్నీర్గా విక్రయించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశముంది.
ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు….
ఈ ఉల్లంఘించి కృత్రిమ పన్నీర్ను తయారు చేసినా, విక్రయించినా, సరఫరా చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.













Leave a Reply