(న్యూస్ఇన్,హైదరాబాద్)
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, నాణ్యమైన ఆహారం, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, డైట్ అమలు పకడ్బందీగా జరిగేలా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న భోజనం, డైట్ చార్జీల వినియోగం, నిత్యావసర సరుకుల సరఫరా, వాటి నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్, భవనాల నిర్వహణ, బెడ్డింగ్ మౌలిక వసతులపై మంత్రి లక్ష్మణ్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సూచించారు.

ఆహారం-ఆరోగ్యంపై దృష్టి….
విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా? నాణ్యమైన బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు, గుడ్లు, పండ్లు తదితర పోషకాహార పదార్థాలు సక్రమంగా సరఫరా అవుతున్నాయా? వంటశాలల్లో పరిశుభ్రత పాటిస్తున్నారా? అనే అంశాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.నిత్యావసర సరుకుల కొనుగోలు, సరఫరా, నిల్వ, వినియోగ ప్రక్రియలను పర్యవేక్షించాలని, నాణ్యతలో లోపాలు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనారోగ్యానికి గురయ్యే వారికి తక్షణ వైద్య సహాయం అందేలా సమీపంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.బాలికల వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, శానిటరీ అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని మంత్రి సూచించారు.
భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ….
వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. భవనాల స్థితిగతులు, విద్యుత్ వైరింగ్, అగ్నిమాపక భద్రత, తాగునీటి వసతులు, మరుగుదొడ్లు, వంటశాలలు తదితర అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, వాటి పరిష్కారానికి స్పష్టమైన బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించారు.విద్యతోపాటు క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచిం












Leave a Reply