(హైదరాబాద్,న్యూస్ఇన్)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో రెండో సంచలనం సృష్టించిన కేసు నమోదైంది.రాజకీయాల్లో కలకలంగా మారిన రెండు కీలక కేసులు ఆ పోలీస్ స్టేషన్ లో నమోదు కావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. గత ప్రభుత్వ హాయంలో నమోదైన ఓ కేసు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ప్రస్తుతం కూడా మరో కేసు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చకు దారి తీస్తోంది. గతంలో పేట్ బషీరాబాద్ పోఈసులు అత్యుత్సాహం చూపారన్న ఆరోపణలు ఎదుర్కోగా…. ప్రస్తుతం కేసును నీరు గార్చే యత్నం చేస్తున్నార్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బండి భగీరథ్ పై పోక్సో కేసు……..
ఓ మైనర్ బాలిక కేంద్ర హోమంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై అ నెల 8వ తేదీన ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు దాదాపు ఆరు గంటల పాటు ఆ బాలికతో పాటు బాలిక కుటుంబ సభ్యులతో అనుసరించిన విధానం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేసు నమోదు చేయడం, స్టేషన్ బేయిల్ దక్కేలా ముందుగా సెక్షన్లు నమోదు చేశారన్న ఆరోపణలు పోలీసులు ఎదుర్కొన్నారు. 10వ తేదీన ప్రధాని మోడీ పర్యటన హైదరాబాద్ లో ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును లైట్ గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడం…ఆ తరువాత జాతీయ మీడియ ఈ కేసుకు ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణాలోని మీడియా సంస్థలు అప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసును స్పీడుగా విచారించాలని ఆదేశించిడం, సిట్ నియామకం వెంటవెంటనే జరగడంతో ఐదు రోజుల తరువాత పోలీసులు ఈ కేసు విచారణను ముమ్మరం చేశారు. కేసు విచారణ దశలో ఉంది. బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ బుధవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉన్నా….14 వ తేదీన కోర్టు విచారణ నేపథ్యంలో 15 వ తేదీన పోలీసుల ముందు విచారణకు హాజరవుతారని సమాచారం ఇచ్చారు.

శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు…
మరో కేసు విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను పేట్ బషీరాబాద్ పోలీసులు ఎంతో చాకచక్యంగా భగ్నం చేశారు. మంత్రి హత్యకు కుట్రను ఛేధించి అప్పట్లో అందరి నుంచి పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. ఈ కుట్రలో భాగస్వామ్యం అయిన వారందరినీ పోలీసులు ముదుగానే గుర్తించారు. మంత్రి హత్యకు వినియోగించేందుకు సిద్ధం చేసుకున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత సివిల్ సప్లై కమిషనర్ గా ఉన్న స్టిఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించడం అప్పట్లో తెలంగాణాలో ఈకేసు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యక్తి గత సిబ్బందిపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మంత్రి హత్య కుట్ర కేసును పోలీసులు బయట పెట్టినా…. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వినిపించాయి.
బండి సంజయ్ ఎమోషన్….
ఇప్పడు కూడా రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరత్ పై నమోదైన కేసు కలకలం రేపుతోంది. బండి సంజయ్ తనయుడిపై నమోదైన ఈ కేసుతో సంజయ్ ఎమోషన్ అవుతున్నారు. తనపై కుట్రలు చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరికలు చేస్తున్నారు. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి కేసులు ఆ పోలీస్ స్టేషన్లో నమోదు కావడంతో పేట్ బషీరాబాద్ పోలీసుల పనితీరు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తుంది.












Leave a Reply