(అమరావతి,న్యూస్ఇన్)
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడును నెల్లూరు లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా….. ప్రధాని మోడీ సూచనలు పాటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహానాడును టీడీపీ కార్యాలయంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. అన్నిగ్రామాల్లో క్లస్టర్ల వారిగా ఎల్ ఇడీ స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించిందని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావ్ వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో జరగబోయే పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ మోడ్ లో జరపాలని పార్టీ నిర్ణయించింది.

పశ్చిమాసియా యుద్ధం, ప్రస్తుతం దేశంలో ఉన్న ‘ఆయిల్ క్రైసిస్’ (చమురు సంక్షోభం) ప్రభావం దృష్ట్యా బాధ్యతగా వ్యవహరించాలని జాతీయ అధ్యక్షులు భావించారు. పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఈ నెల 27, 28 తేదీన హైబ్రిడ్ మోడ్ లో జరిగే మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం. ఒక్కో క్లస్టర్ దగ్గర సుమారు 500 మంది కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు ఉంటాయి. మే 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడులు, 23, 24 తేదీల్లోని పార్లమెంట్ స్థాయి మహానాడులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతించాలని కోరుతున్నాం.










Leave a Reply