(హైదరాబాద్,న్యూస్ఇన్)
పోక్సో కేసు విచారణను ఎదుర్కొంటున్న జూనియర్ బండి పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
జాతీయ స్థాయిలో చర్చనీయంశంగా మారిన బండి భగీరథను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నాలు మొదలు మొదలు పెట్టారు. రెండు సార్లు నోటీసులు ఇచ్చినా బండి భగీరథ పోలీసు విచారణకు హాజరు కాకపోవడంతో భగీరథ ను అదుపులోకి తీసుకునేందుకు 5 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు.కరీంగనగర్, హైదరాబాద్, ఢిల్లీలో భగీరథను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. 8వ తేదీన ఫిర్యాదు అందిన నాటి నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ పరారీలో ఉన్నారు. భగీరథ ముందస్తు, తాత్కాలిక ఉపశమనం కోసం మధ్యంతర బేయిల్ యత్నాలు విఫలం అయ్యాయి. వచ్చే వారానికి ఈ కేసు విచారణకు వాయిదా పడడంతో…ఇక పోలీసులు భగీరథను అదుపులోకి తీసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు భగీరథ ఆచూకీ కనుగొనడంలో విజయవంతం కాలేకపోయారు. 13వ తేదీన విచారణకు పోలీసులు ఆహ్వానించినా….. బేయిల్ పిటీషన్ పై కోర్టు విచారణ జరుపుతుండడంతో రెండు రోజుల సమయం కావాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భగీరథ సమాచారాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుని బండి భగీరథ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు పెద్దగా చేయలేదు.

సంజయ్ పై పెరుగుతున్న విమర్శలు……
భగీరథ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో… భగీరథ పరారీ విషయం అందరిలోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బాధ్యతా యుతమైన పదవిలో ఉన్న సంజయ్ తన పదవికి తగ్గట్లుగా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ బండి సంజయ్ తనయుడిని కాపాడేందుకు అనుసరిస్తున్న వ్యూహం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పోక్సో కేసు సక్రమంగా విచారణ జరుగాలంటే సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. మొత్తం మీద జూనియర్ బండి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతుండడం సీనియర్ బండి రాజకీయ భవిష్యత్తును అయోమయంగా మార్చేలా కనిపిస్తుందన్న వాదన రోజు రోజుకు పెరుగుతోంది.











Leave a Reply