(మెదక్,న్యూస్ఇన్)
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సైకిళ్ళ పంపిణీ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్న జగ్గారెడ్డి మరో 70 మంది చిన్నారులకు సైకిల్స్ పంపిణీ చేశారు. 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు సైకిల్స్ అందించేలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 400 సైకిల్స్ పంపిణీ పూర్తి అయ్యింది. తమ కార్యాలయంలో ఆధార్ జిరాక్స్ ఇచ్చి, పేర్లు నమోదు చేసుకున్న అందరికీ విడతల వారీగా సైకిల్స్ అందిస్తామని జగ్గారెడ్డి అన్నారు. తన కార్యాలయంలో నమోదు చేసుకున్న వారందరికీ విడతల వారిగా సైకిళ్లు అందించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఆదివారం రోజు మరో 156 మందికి సైకిళ్లు ఇచ్చేందుకు టోకెన్లు పంపిణీ చేశారు.

చిన్నారులతో…..
సైకిల్స్ పంపిణీ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. వారితో కరచాలనం చేస్తూ, హాయ్ చెబుతూ వారితో కలిసిపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు కూన సంతోష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.








Leave a Reply