NewsInn

News in a Click

ఏసీబీకి చిక్కిన‌ అవినీతి మ‌హిళా అధికారి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మ‌రో అవినీతి అధికారి ఏసీబీ అధికారుల‌కు చిక్కారు. గ‌త కొన్ని రోజులుగా వ‌రుస‌గా ఏసీబీ అధికారులు దాడుల్లో ప్ర‌భుత్వ అధికారులు వ‌రుస‌గా ప‌ట్టుబ‌డుతున్నారు. న‌గ‌ర శివారుల్లోని శామీర్ పేట త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ఏసీబీ దాడులు చేసింది. 20 లక్ష‌ల రుపాయాల లంచం తీసుకుంటూ శామీర్ పేట త‌హ‌సీల్దార్ సుచ‌రిత ప‌ట్టుబ‌డ్డారు. మండ‌లంలోని బొమ్మ‌రాసిపేట గ్రామ ప‌రిధిలోని భూముల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ భూముల విష‌యంలో అవినీతికి పాల్ప‌డి ల‌బ్ది చేకూరేలా చేశార‌న్న ఆరోప‌ణ‌లు గ‌త కొన్ని రోజులుగా ఉన్నాయి.మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాకు మ‌రో రెవెన్యూ అధికారి నివాసంపై అదాయానికి మించిన ఆస్తులున్నాయ‌న్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వంద కోట్ల రుపాయాల‌కు పైగా అక్ర‌మంగా ఆదాయం స‌మ‌కూర్చిన‌ట్లు ప్రాథ‌మికంగా అధికారులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *