ప్రెస్ మీట్లతో గళం విప్పిన నేతలు
సీఎం రేవంత్ సహా మంత్రుల అటాక్
కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండూ ఒకటే బీజెపి
(హైదరాబాద్,న్యూస్ఇన్)


సాగునీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రజల తరపున మరోసారి తాను సాగునీటి పోరాటం చేస్తానని మాజీ సీఎం ఆదివారం ప్రకటించారు. మాజీ సీఎం ప్రటకన రాష్ట్రంలో ఒక్క సారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. కృష్ణా,గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను ప్రభుత్వ వైఖరితో కోల్పోతున్నామని కేసిఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగానే వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పథకాలపై తీవ్రంగా వరుచుకు పడ్డారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కేసిఆర్ తప్పు బట్టారు. గోదావరి జలాల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం దాదాపు 1.30 గంటల పాటు మాజీ సీఎం కేసిఆర్ కృష్ణా జలాల పై అవగాహన కల్పించే యత్నం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. దాదాపు ఏడాది తరువాత కేసిఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో సహజంగా అందరి దృష్ఠి కేసిఆర్ పై ఉంటుంది. రాష్ట్రంలో అదికార పార్టీ కూడా అందుకు మినహాయింపు ఏమి కాదు. కేసిఆర్ మీడియా సమావేశం పూర్తయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ ఉంటుందని సీఎంఓ నుంచి సాయంత్రం 6 గంటలకు ముందుగానే మీడియాకు సమాచారం వచ్చింది. కేసిఆర్ ప్రెస్ మీట్ పూర్తి కాగానే సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లో మీడియా సమావేశాన్ని(చిట్ చాట్) ఏర్పాటు చేసి కృష్ణా గోదావరి జలాల విషయంలో కేసిఆర్ అనుసరించిన విధానం తప్పుడు విధానమని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణా ఆవిర్బావం తరువత తెలంగాణాకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు.త్వరలో అసెంబ్లీ సమాశాలు ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చిద్దామని దమ్ముంటే రావాలని సవాల్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కృష్ణా జలాల విషయంలో స్పందించి బీఆర్ ఎస్ సర్కార్ ను తప్పు బట్టారు.

కృష్ణా జలాల విషయంలో సోమవారం కూడా అటు అమాత్యులు, ఇటు బీఆర్ ఎస్ నేతలు మీడియా సమావేశాలను ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావ్, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ లు మీడియాతో కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ వాదనను వినిపించారు. కేసిఆర్ కు ముందు చూపులేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణా భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసిఆర్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలమూరు ఎత్తి పోతల పథకం ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మరగుజ్జు మనస్తత్వంతో సీఎం మాట్లాడడం తగదని హితవు చెప్పారు.

మరోసారి సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించి కృష్ణా జలాల విషయంలో తమ ప్రభుత్వం కారణంగా ఎక్కడా ప్రజలకు నష్టం జరుగడం లేదన్న అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.మరో మంత్రి శ్రీధర్ బాబు ఐటి, పరిశ్రమల శాఖలపై స్పందించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం, పారిశ్రామిక వేత్తలతో ఎంఓ యూ లు చేసుకోవడం అన్ని ప్రభుత్వాల్లో సాధారణంగా జరిగే ప్రక్రియ అనిచెప్పుకొచ్చారు. కేసిఆర్ సర్కార్ హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తే తాము హోప్ క్రియేట్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

మహబూబ్ నగర్ ఎంపీ డీకే ఆరుణ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల వైఖరిని తప్పు బట్టారు. పదేళ్లు అదికారంలో ఉన్నా కేసిఆర్ పాలమూరు ఎత్తి పోతల పథకాన్ని పట్టించుకోలేదనిఆరోపించారు. సీఎం రేవంత్ పాలన పత్రికలకే పరిమితం అయిందని విమర్శించారు. మొదటి డీపిఆర్ ప్రకారమే పాలమూరు పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.కృష్ణా గోదావరి జలాల వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత రంజుగా మారే అవకాశం కనిపిస్తోంది.







Leave a Reply