NewsInn

News in a Click

ఈ నెల 29 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఈ నెల 29వ తేదీ నుంచి తెలంగాణా అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రుల‌తో భేటీ సంద‌ర్బంగా అసెంబ్లీ స‌మావేశాల తేదీలను ఖ‌రారు చేశారు. 29వ తేదీన అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైనా మూడు రోజుల పాలు వైకుంఠ ఏకాద‌శి, కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్బంగా మూడు రోజుల ( 30,31,1) తేదీల్లో స‌మావేశాల‌కు సెల‌వు ఇచ్చి తిరిగి 2వ తేదీన అసెంబ్లీ స‌మావేశాలు మొద‌లు పెట్టాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో హీట్ పుట్టిస్తున్న కృష్ణా, గోదావ‌రి జలాల విష‌యం వివాదాస్ప‌దంగా మార‌డంతో ప్ర‌భుత్వం ఈ అంశం ఎజెండానే స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తోంది.

అసెంబ్లీలో చ‌ర్చిద్దామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ కు స‌వాల్ విస‌ర‌డం….బీఆర్ ఎస్ కూడా సై అంటుండ‌డంతో అసెంబ్లీ స‌మావేశాలు కూడా వాడి వేడిగా జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. సాగునీటి జ‌లాల విష‌యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను శాసనసభ సమావేశాల సందర్భంగా చర్చకు తేవాల‌ని అదికార పార్టీ భావిస్తోంది.నీటిపారుదల అంశాలపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎండగట్టాలని సీఎం మంత్రుల‌కు సూచించిన‌ట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *