(హైదరాబాద్,న్యూస్ఇన్)
వేసవి కాలం ముగిసి దాదాపు నెల రోజులు పూర్తయినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావంతో ఈ పరిస్థితి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత వారణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా బలమైన అల్ప పీడనం కారణంగా వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాతో మహారాష్ట్రాలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రాలో వర్షాలకు దాదా 15 మంది మృత్యు వాత పడ్డారు. ఐఎండీ అంచనాలు ఇలా ఉన్నాయి.
అతి భారీ వర్షాలు……

గుజరాత్, కొంకణ్ & గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7-20 సెం.మీ అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు (20 సెం.మీ పైగాతీర కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, తెలంగాణ, విదర్భలలో అక్కడక్కడ ఈ వర్షాలు కురుస్తాయని అంచనా.
భారీ వర్షాలు….
అండమాన్ & నికోబార్ దీవులు, అస్సాం & మేఘాలయ, ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, గంగా పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, అంతర్గత కర్ణాటక, కేరళ & మాహె, మరాఠ్వాడా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు-పుదుచ్చేరి & కరైకల్, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్లలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
బలమైన ఉపరితల గాలులు…..
కర్ణాటక, లక్షద్వీప్, రాయలసీమలలో అక్కడక్కడ బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అనవసర ప్రయాణాలను నివారించాలని, నదులు, వాగుల సమీపంలో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.












Leave a Reply