NewsInn

News in a Click

ఉర్సు ఉత్సవాల‌పై జగ్గారెడ్డి సమీక్ష

ఉర్సు ఉత్సవాల‌పై జగ్గారెడ్డి సమీక్ష

ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌రాదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

వచ్చే నెల జనవరి 9,10,11 వ తేదీలలో సంగారెడ్డిలో జరగనున్న ఫతే ఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డి అధికారుల‌కు సూచించారు. ఉర్సు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.
ఫతే ఖాన్ దర్గా తో పాటు పరిసరాలు అంతటా, నాల్సాబ్ గడ్డ నుండి పాత బస్టాండ్ వరకు, జేసీ ఇంటి నుండి ఫతే ఖాన్ దర్గా వరకు, కోర్టు నుండి నాల్సాబ్ గడ్డ వరకు, ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఓల్డ్ ఆర్డీవో ఆఫీస్ వరకు పూర్తిగా లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. స‌మీక్ష‌లు మాట్లాడిన జ‌గ్గారెడ్డి హిందూ , ముస్లిం, క్రిస్టియన్ల పండుగలు ఏవైనా నేను నాన్ పొలిటికల్ గా పాల్గొంటాను, నా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌డం, సంగారెడ్డి ప‌ట్ట‌ణ వ్య‌క్తిగా ఉర్సు ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను తెలుసుకునేందుకు వ‌చ్చాన‌ని జ‌గ్గ‌రెడ్డి వ్యాఖ్యానించారు.ఉర్సు ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాట్లు చేయాల‌ని, వారికి నా సహకారం ఉంటుందన్నారు. అధికారికంగా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు పక్కా గా జరగాలని అధికారుల‌కు సూచించారు. అన‌ధికారికంగా తన వంతు స‌హాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. భారీగా వ‌చ్చే జ‌నాన్ని దృష్టిలో ఉంచుకుని మొబైల్ టాయిలెట్స్ కావాలని ఉత్సవ కమిటీ స‌భ్యులు కోరారు. లైటింగ్, టెంట్, సౌండ్ వంటి ఏర్పాట్లు మున్సిపల్ అధికారులు చేస్తారని, పెయింటింగ్ తో పాటు మూడు నుండి నాలుగు వేల మందికి భోజన ఏర్పాట్లు తన స్వంత ఖర్చులతో చేస్తానని జ‌గ్గారెడ్డి హామీ ఇచ్చారు.

ఉర్సు ఉత్స‌వాల‌కు జిల్లా మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా తో పాటు ఇంఛార్జ్ మంత్రి వివేక్, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే కు, టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కి అధికారికంగా ఆహ్వానాలు అందించాలని వక్ఫ్ బోర్డు అధికారులకు సూచించారు.జనవరి నెల 6 వ తేదీ వరకు ఏర్పాట్లు అన్ని పూర్తి కావాలని . 6 వ తేదీన తాను మ‌రోసారి వ‌చ్చి ఏర్పాట్లు ప‌రిశీలిస్తాన‌న్నారు. దర్గా కు శాశ్వితంగా సౌకర్యాలు ఎం కావాలో ఒక డిజైన్ తయారు చేయాల‌ని అధికారులు, దర్గా కమిటీ కి సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డినియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించే స‌మ‌యంలో ఫతే ఖాన్ దర్గా తో పాటు సిఎస్ఐ చర్చ్, వైకుంఠ పురం, మహేశ్వర శర్మ జ్యోతిర్వాస్తు విద్యా పీఠం కు సైతం నిధులు ఇప్పిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.ఫతే ఖాన్ దర్గా, సదాశివ పేట మహబూబ్ భాష దర్గా కమిటీ ల నియామకాలు త్వ‌ర‌లో పూర్త‌య్యేలా చూస్తాన‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *