NewsInn

News in a Click

బీఆర్ఎస్ పై విరుచుకు ప‌డ్డ సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పై విరుచుకు ప‌డ్డ సీఎం రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో బీఆర్ ఎస్ అనుస‌రిస్థున్న విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విరుచుకు ప‌డ్డారు. కిలాడీల టీం నాయ‌కుడు కేసీఆర్ అయితే హ‌రీష్, కేటిఆర్ లు స‌భ్యులుగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు. ఈ బృందంలో ఇప్పుడు ఈట‌ల కూడా చేరార‌ని సీఎం ఆరోపించారు. ఈ ముఠాను చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో పెడితే అప్పులు, త‌ప్పులు తెలిసి వ‌చ్చేయ‌ని సీఎం అన్నారు. మ‌హారాష్ట్ర‌లో కురుస్తున్న వ‌ర్షాల‌తో గోదావ‌రిలో నీళ్లు పారుతున్నాయ‌ని,ఆ నీళ్ల‌ను ఎత్తిపోయాల‌ని బీఆర్ ఎస్ నేత‌లు డిమాండ్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై వివ‌రించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ బీఆర్ ఎస్ నేత‌ల మాదిరిగానే మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఈట‌ల‌పై గౌరం ఉన్నా…ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో గౌర‌వం త‌గ్గుతుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌తో ఈట‌ల చ‌ర్చించి మాట్లాడితే బాగుండేద‌ని సీఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. హ‌రీష్ రావ్ సూచ‌న‌ల మేర‌కు ఈట‌ల చేస్తున్న వ్యాఖ్య‌లు స‌మంజ‌సం కాద‌న్నారు. రిటైర్డ్ ఇంజ‌నీర్లు తెలంగాణా వాదం ముసుగులో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌న్నారు.

ఎన్డీఎస్ ఏ నివేదిక‌లు, సూచ‌న‌ల ప్ర‌కారం ప్ర‌భుత్వం ముందుకు వెళుతుంద‌న్నారు. మేడిగ‌డ్డ బ్యారేజ్ ను పూర్తి స్థాయి మ‌ర‌మ్మ‌త్తులు చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని ఎన్డీఎస్ ఏ స‌చ‌న‌లు చేసింద‌న్న విష‌యాన్ని సీఎం వెల్ల‌డించారు. ఈ బారేజ్ ల‌లో గేట్లు మూసి వేస్తే త‌ప్ప నీరు నిల్వ చేయ‌లేమ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం ఉన్నా పంపింగ్ చేసే స్థాయిలో 93.50 మీటర్ల వ‌ర‌కు నీరు పార‌డం లేద‌న్నారు.

హ‌రీష్ ల‌క్ష కూడా వ‌ద‌ల‌డం లేదు…..

క‌మీష‌న్లు బొక్కేందుకు అల‌వాటు ప‌డ్డ హ‌రీష్ రావ్ ల‌క్ష రుపాయ‌లు కూడా ఇప్పుడు వ‌ద‌ల‌డం లేద‌ని సీఎం ఆరోపించారు. క్ర‌ష‌ర్ మిష‌న్ల య‌జ‌మానుల‌తో ల‌క్ష రూపాయ‌లు అడుగుతున్న సంద‌ర్భాలున్నాయ‌న్నారు. రాబోయే రోజుల్లో ఇక పండ్ల బండ్ల ద‌గ్గ‌ర కూడా క‌మిష‌న్లు వ‌సూలు చేసేందుకు హ‌రీష్ తెగ‌బ‌డుతార‌ని సీఎం వ్యాఖ్య‌లు చేశారు. హ‌రీష్ రావు క‌మీష‌న్లు బొక్క‌లేక‌ భ‌రించ‌లేక కేసీఆర్ రెండో సారి మంత్రి వ‌ర్గంలోకి తీసుకునేందుకు ఏడాది పెండింగ్ లో ఉంచార‌ని సీఎం అన్నారు. ఆంధ్రా సంస్థ‌లని నారాయ‌ణ‌, చైత‌న్య విద్యా సంస్థ‌ల‌ను విమ‌ర్శించిన హ‌రీష్ ఆ సంస్థ‌ల స‌హ‌కారంతో బ్ర‌త‌క‌డం ఒక బ్ర‌తుకేనా అని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *