NewsInn

News in a Click

సీఎం రేవంత్‌కు ఆ హంతకుడికి తేడా లేదు

సీఎం రేవంత్‌కు ఆ హంతకుడికి తేడా లేదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని హ‌రీష్ రావు అన్నారు. రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం, బెల్టుతో కొట్టాలని మాట్లాడటం ఆయన మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఆరు హత్యలు చేసిన షాబాద్ దైవాలగూడ హంతకుడికి తేడా ఏమీ లేదనిపి బీఆర్ ఎస్ ఎల్పీ నేత హ‌రీష్ రావ్ అన్నారు. నీచమైన, హింసాత్మకమైన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసినందుకు రాష్ట్ర ప్రజలకు, రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం ప్రజల ముందుకు వస్తాయో.. అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి డైవర్షన్ డ్రామాలు తెరపైకి తేవ‌డం రేవంత్ కు పరిపాటిగా మారింద‌న్నారు.

పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ మానవ మృగం.. ఓ మైనర్ అమ్మాయిపై అఘాయిత్యానికి ఆమె తల్లిని, నాయనమ్మను, ముగ్గురు పసిపిల్లలను అత్యంత కిరాతకంగా చంపి నరమేధం సృష్టించాడన్నారు. మ‌ర‌ణ హోమానికి పాల్ప‌డిన హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనానికి పరాకాష్ట అని హ‌రీష్ రావ్ ఆరోపించారు. శాంతిభద్రతల వైఫల్యం నుండి దృష్టి మ‌ళ్లించేందుకు కాళేశ్వ‌రం, ఎన్డీఏఎస్ ఏ రిపోర్ట్ అంటూ మ‌రో డ్రామాకు తెర‌తీశార‌ని ఆరోపించారు. కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు.. కానీ, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు” అన్న అబ్రహం లింకన్ మాటలు రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతాయన్నారుకాళేశ్వ‌రం నీటి విష‌యంలో నిద్రపోయే వాడిని లేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేమన్న చందంగా సీఎం ప‌రిస్థితి ఉంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *