(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధ పడుతోన్న ఆమె మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ గాయని గొంతు మూగ బోయింది. అద్భుతమైన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు కోట్లాది మంది శ్రోతలను మైమరపించింది. ఎస్. జానకి 1938, ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించారు. శాస్త్రీయ సంగీతం ప్రత్యేకంగా నేర్చుకోకుండానే తన స్వరంతో ఆరు దశాబ్ధాల పాటు సంగీత పరిశ్రమలో తన గాత్రంతో అభిమానులకు చేరువయ్యారు. తొలిసారి 1957లో తమిళ చిత్రం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తరువాత తెలుగు,హీందీ, మలయాళం 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడి సరికొత్త రికార్డు సృష్టించారు. తన స్వరంతో 4 జాతీయ అవార్డులు, 32 వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు సాధించారు. ఎలాంటి పాత్రకైనా తన గొంతుతో ప్రాణం పోయడం జానకి ప్రత్యేకత. జానకి భౌతికంగా లేకపోయినా… ఆమె మధుర స్వరం సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.

సినీ ప్రస్థానం….
1957లో తమిళ చిత్రం విధియిన్ విలయాట్టు, తెలుగులో ఎమ్మెల్యే చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, పి.సుశీల వంటి కలిసి పాడారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలపై పట్టు సాధించారు.
పద్మభూషణ్ తిరస్కరణ….
2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఆమె తిరస్కరించడం తీవ్ర చర్చకు దారి తీసింది. దక్షిణాది కళాకారులకు సరైన గుర్తింపు దక్కలేదనే కారణంతో తిరస్కరించడం సీనీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.ఉత్తమ నేపథ్య గాయనిగా జానకి నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33కు పైగా ఫిలిం అవార్డులు, మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కళైమామణి’, కర్ణాటక నుంచి ‘రాజ్యోత్సవ’ పురస్కారాలు ఆమెకు ప్రతిభకు దక్కాయి. యువ గాయకులకు అవకాశం దక్కాలన్న అభిప్రాయంతో 2017 నుంచి పాటలు పాడడానికి ఆమె గుడ్ బైచెప్పారు. గాన కోకిల జానకి మరణంపై పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.












Leave a Reply