(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆదాయనికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో ఏసీబీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏసీబీ అధికారి మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో రవీందర్ ఇళ్లతో పాటు 12 చోట్ల ఆయన సమీప బంధువులు ఇళ్లలో కూడా సోదాలు మొదలు పెట్టారు. సోదాల వివరాలు ఈ సాయంత్రానికి బయటకు వచ్చే అకవాశం ఉంది. పెద్ద పల్లిలో మున్సిపల్ ఏఇ సతీష్ ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా దొరికారు. రెండు లక్షల రుపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎంబీ రికార్డు చేసేందుకు ఏఇ లంచం అడిగినట్లు ఏసీబీ కి ఫిర్యాదు అందడంతో అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ఉన్నతాధికారులకు కూడా వాటాలు ఇవ్వాలని చెబుతూ కాంట్రక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున సతీష్ డబ్బులు వసూలు చేస్తారని ప్రచారం ఉంది.











Leave a Reply