(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) చీఫ్ ఇంజినీర్ బి. రవీందర్ ఆస్తులపై గతకొన్ని రోజులుగా వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఏసీబీ దాడులు నిర్వహించి ఈ కీలక అధికారి జీతం తో పాటు కూడ బెట్టిన ఆస్తులను అధికారులు గుర్తించారు. రవీందర్ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వెలుగు చూసిన ఆస్తుల వివరాలను అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు మాత్రమే ఇలా ఉన్నాయి…బహిరంగ మార్కెట్ లో వీటి విలువను లెక్కించే పనిలో ఏసీబీ ఉంది.
సోదాల్లో వెలుగుచూసిన ఆస్తులు…..

కొండకల్, కిస్తాపూర్, పసుమాముల ప్రాంతాల్లో ఐదు ఓపెన్ ప్లాట్లు
నార్సింగి, నానక్రామ్గూడలో నాలుగు ఫ్లాట్లు
కొత్తూరు మండలం గూడూరు, శంషాబాద్ ప్రాంతాల్లో 4 ఎకరాల వ్యవసాయ భూమి
మొకిలలోని శ్రీనివాస మెడోస్లో 300 గజాల సెమీ ఫినిష్డ్ విల్లా
కొండాపూర్ మస్జిద్ బండలో జీ+4 భవనం ఒక్క భవనం
ఇవన్నీ స్థిరాస్తుల రూపంలో ఉండగా….ఇంట్లోనే దాదాపు నాలుగు లక్షలు మాత్రమే నగదును అధికారులు గుర్తించారు. దాదాపు 2 కిలోల బంగారం, వివిధ బ్యాంకుల్లో 45 లక్షల రుపాయాలకు పైగా బ్యాలెన్స్, దాదాపు 1.50 కిలోల వెండి మాత్రమే అధికారుల కంటికి కనిపించింది. గృహోపకరణాల విలువ దాదాపు 20 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇక వీటితో పాటు లెటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హార్డ్డిస్క్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు దాదాపు 10 లక్షల విలువ చేసేవిగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఇక వాహనాల విషయానికి వస్తే ఒకే ఒక్క ఇన్నోవా క్రిస్టా, ఒక్క టాటా సఫారి, ఒక్క మహీంద్ర ఎక్స్ యూవీ సహా ఇతర వాహనాలు కలిపి 1.25 కోట్ల విలువ చేసేవి ఉంటాయని అంచనా
గత కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు అవినీతి పెద్ద చేపలపై దృష్టి పెడుతూ వందల కోట్ల రుపాయాల అక్రమాస్తులను కూడ బెట్టిన అధికారులను కట కటాల్లోకి పంపించారు. తాజాగా ఈ అధికారిని కూడా అదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదు కారణంగా సోదాలు నిర్వహించి అధికారికంగా వీటన్నింటి ఆస్తుల విలువ రూ. 10 కోట్ల లోపే అని ఏసీబీ అధికారులు అంచనా వేశారు.













Leave a Reply