(హైదరాబాద్,న్యూస్ఇన్)
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, కార్యకర్తలతో క్షేత్రస్థాయి ప్రత్యక్ష సమావేశాలు, స్థానిక ప్రజాసమస్యలపై సమీక్ష తదితర అంశాలు ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
పర్యటనల షెడ్యూల్:
● జూలై 25 (శనివారం)
- చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం
● ఆగస్టు 1 (శనివారం)
- మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం
● ఆగస్టు 8 (శనివారం)
- ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం – ఉదయం
- నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం – సాయంత్రం
● ఆగస్టు 9 (ఆదివారం)
- కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం – ఉదయం
- పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం – సాయంత్రం
● ఆగస్టు 16 (అదివారం)
- మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం – ఉదయం
- జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం – సాయంత్రం
● ఆగస్టు 22 (శనివారం)
- నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం – ఉదయం
- భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం – సాయంత్రం
● ఆగస్టు 23 (ఆదివారం)
- వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం – ఉదయం
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం – సాయంత్రం
● ఆగస్టు 29 (శనివారం)
- నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొదటి విడత సమావేశం ఇటీవల జరిగింది. పైన పేర్కొన్న 13 పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటన ముగిసిన అనంతరం జీహెచ్ఎంసీ పరధిలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటన ఉంటుంది.












Leave a Reply