NewsInn

News in a Click

కోడంగ‌ల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

కోడంగ‌ల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. శుక్ర‌వారం మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ప‌రిశీలిస్తారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్ వాద్ లో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించనున్న సీఎం సాయంత్రం 4.00 గంటలకు దౌల్తాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తారు. అనంత‌రం కోడంగ‌ల్ లోని నివాసానికి చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స చేస్తారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం తిరిగి రోడ్డు మార్గాన హైద‌రాబాద్ చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *