NewsInn

News in a Click

చిన్నారెడ్డి పై కాంగ్రెస్ హై క‌మాండ్ క‌న్నెర్ర‌….!

చిన్నారెడ్డి పై కాంగ్రెస్ హై క‌మాండ్ క‌న్నెర్ర‌….!

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జిల్లెల చిన్నారెడ్డిపై కాంగ్రెస్ హై క‌మాండ్ క‌న్నెర్ర చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నించినా వివిధ కార‌ణాల‌తో ఆయ‌న బ‌రిలో నిల‌బ‌డే అవ‌కాశం లేదు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ద‌క్కించుకుని ఎమ్మెల్యే విజ‌యం సాధించిన మేఘారెడ్డికి ఈ సీనియ‌ర్ నేత‌కు అప్ప‌టి నుంచే విబేధాలు మొద‌ల‌య్యాయి. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ బుజ్జ‌గించి అనంత‌రం ప్ర‌భుత్వ ప‌రంగా కీల‌క బాద్య‌త‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అప్ప‌గించారు. ఇటీవ‌లి కాలంలో చిన్నారెడ్డి వ‌ర్గం నేత‌ల‌ను మేఘారెడ్డి వేధింపుల‌కు గురిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు మొద‌లు కావ‌డంతో..చిన్నా రెడ్డి త‌న వ‌ర్గం నేత‌ల‌కు అండ‌గా నిలుస్తూ ఎమ్మెల్యేపై ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం ఢిల్లీ పెద్ద‌ల వ‌ర‌కు చేరుకుంది. ఎమ్మెల్యే మేఘా త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్ర‌నేత‌ల‌ను క‌లిసి చిన్ని రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ విచార‌ణ జ‌రిపి ఆ నివేదిక‌ను ఢిల్లీ హై క‌మాండ్ కు పంపించింది. మంత్రి కొండా సురేఖ తో పాటు చిన్నా రెడ్డిపై నివేదిక‌ను కాంగ్రెస్ నేత‌లు హై క‌మాండ్ కు అప్ప‌గించినా….సీనియ‌ర్ నేత‌పై హై క‌మాండ్ చ‌ర్య‌ల‌కు సిద్ధం అవుతుంద‌న్న సంకేతాలు ఇస్తోంది. చిన్నా రెడ్డి ని ప్ర‌ణాళికా సంఘం వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పించి కొత్త నేత‌కు అక్క‌డ అవ‌కాశం ప్ర‌భుత్వం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

సీనియ‌ర్ నేత‌పై కాంగ్రెస్ సీరియ‌స్…..

దీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చిన్నారెడ్డికి పార్టీలో సీనియర్ నేతగా, పార్టీ కి లాయ‌ల్ గా ఉంటార‌న్న‌ గుర్తింపు ఉంది. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆయనకు ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కీలక నిర్వ‌హిస్తున్నారు. సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న‌పై కాంగ్రెస్ హై క‌మాండ్ సీరియ‌స్ గా ఉంద‌న్న ప్ర‌చారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కాంగ్రెస్ పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించే నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న సంకేతాలు ఇచ్చేందుకే సీరియ‌స్ గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో మ‌రికొంత మంది కాంగ్రెస్ నేత‌లు కూడా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌హా పార్టీ హై క‌మాండ్ ను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సురేఖ‌, చిన్నారెడ్డి, ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంతో తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కొండా సురేఖ పార్టీ హై క‌మాండ్ కు త‌న వివ‌ర‌ణ ఇస్తూ….సీఎం స‌హా ప‌లువురు ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రించిన తీరు త‌ప్పు బట్టారు. పార్టీ చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్దం అయితే… కొండా సురేఖ తో పాటు చిన్నారెడ్డిపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. లేదంటే నేత‌లంద‌రికీ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకునే అవ‌కాశం లేక‌పోలేద‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

కొండా కీల‌క స‌మావేశం…..

ఢిల్లీ పెద్ద‌ల‌తో మాట్టాడి వ‌చ్చిన కొండా సురేఖ త‌న ముఖ్య అనుచ‌రుల‌తో గురువారం వ‌రంగల్ లో స‌మావేశం కానున్నారు. పార్టీ హై క‌మాండ్ చెప్పిన విష‌యాల‌ను నేత‌ల‌కు వివ‌రించి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే పార్టీ హై క‌మాండ్ కొండాపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి స‌హా కీల‌క నేత‌లు ప‌లువురు కొండా ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఏఐసీసీ నేత‌ల ముందు ప‌ట్ట‌బడుతున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *