NewsInn

News in a Click

నిమ్స్ లో య‌ధావిధిగా ఉద్యోగుల‌కు ఓపీ…!

నిమ్స్ లో య‌ధావిధిగా ఉద్యోగుల‌కు ఓపీ…!

( న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

ఉద్యోగులు, పెన్షనర్లు.., వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్‌లో అవుట్‌ పేషెంట్ సేవలు ఉచితంగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఈహెచ్‌ఎస్‌ పేషెంట్లకు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఐపీ సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో మాత్రమే ఓపీ సేవలు అందించాల్సి ఉండగా, నిమ్స్‌లో కూడా అవుట్‌పేషెంట్‌ సేవలు యథావిధిగా ఉచితంగానే కొనసాగించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో 12 వెల్‌నెస్ సెంటర్లు ఉండగా, మరో 24 సెంటర్లను కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది.ఇప్పటివరకూ వెల్‌నెస్ సెంటర్లు లేని, అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనూ మరో 3 వెల్‌నెస్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
జనరల్ హాస్పిటళ్లకు అనుసంధానించి వెల్‌నెస్‌ సెంటర్లలోనూ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేవాల‌ని భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *