NewsInn

News in a Click

ఏపీ వైద్య రంగానికి కొత్త ఊపు…చంద్రబాబు

ఏపీ వైద్య రంగానికి కొత్త ఊపు…చంద్రబాబు

(న్యూస్ఇన్‌,అమ‌రావ‌తి)

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యా ఆరోగ్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి వైద్యాఆరోగ్య శాఖకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను జేపీ నడ్డా, చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి ద్వారా 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి.. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య సేవలతో పాటు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సదుపాయాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి.

జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప‌థ‌కాన్ని అమలు చేస్తామని, ఇది వైద్య రంగంలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందన్నారు.

అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ ప్రాజెక్టు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *