NewsInn

News in a Click

తెలంగాణ లో ‘హైటెక్’ బస్టాండ్లు-త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభం

తెలంగాణ లో ‘హైటెక్’ బస్టాండ్లు-త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభం

(న్యూస్ఇన్,హైద‌రాబాద్)

తెలంగాణాలో అత్యాధునిక బ‌స్ స్టేష‌న్ల‌ను నిర్మాణం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. హై టెక్ హంగుల‌తో తొలి విడ‌త‌లో 13 బ‌స్ స్టేష‌న్లు ఆధునీక‌రించాల‌ని ఆర్టీసి నిర్ణ‌యించింది. నిత్యం ల‌క్షలాది మందిని ఇత‌ర ప్రాంతాల‌కు చేర‌వేసే తెలంగాణా ఆర్టీసీ ఆధునిక నిర్మాణాల‌కు అనుగుణంగా త‌మ బ‌స్టాండ్ ల‌ను ఆధునీక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. విడ‌త‌ల వారిగా అన్ని బ‌స్టాండ్ ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాల‌ని యోచిస్తోంది. 13 బ‌స్ స్టేష‌న్ల‌ను ఆధునీక‌రించ‌నున్న డిజైన్ల‌ను స‌ర్కార్ ఖ‌రారు చేసింది. బ‌స్ స్టేష‌న్ల‌ను కేవలం ప్రయాణానికే పరిమితం చేయ‌కుండా.. వ్యాపారం, వినోదం, ఇతర రవాణా వ్యవస్థలను క‌లుపుతూ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్ విధానంలో 13 నూతన హైటెక్ బస్ స్టేషన్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది.ప్రయాణికులకు రైల్వేతో పాటు ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం కల్పిస్తూ, ఎయిర్‌పోర్ట్ స్థాయి సదుపాయాలతో వీటిని తీర్చిదిద్ద‌నుంది. ఈ ప్రాజెక్టుల‌ను మొద‌లు పెట్టేందుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు లభించాయి.

మల్టీప్లెక్స్ రేంజ్ హంగులు…

మల్టీ-మోడల్ కనెక్టివిటీ: బస్సు దిగగానే రైల్వే లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకునే సదుపాయం.
షాపింగ్ & బిజినెస్ కాంప్లెక్స్‌లు: స్థానిక, ప్రముఖ వ్యాపారులు తమ బిజినెస్ విస్తరణ కోసం వాణిజ్య సముదాయాలు అందుబాటులోకి రానున్నాయి. వినోదం & ఆహారం: ప్రయాణికులు వేచి ఉండే సమయంలో ఆహ్లాదాన్ని పంచే గేమింగ్, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాల‌ని ఆర్టీసి నిర్ణ‌యించింది

వ్యాపారవేత్తలకు ఆహ్వానం…..

ఈ నూతన హైటెక్ బస్టాండ్లలో షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌ల కేటాయింపు కోసం ఆసక్తిగల వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ ప్రకటించింది.

ఆధునీక‌రించ‌నున్న బ‌స్ స్టేష‌న్లు….

నాగర్‌కర్నూల్,రేగొండ, హుజూర్ న‌గ‌ర్, కోదాడ, కొడంగల్, కోస్గి,మద్దూరు, కేసముద్రం,హుస్నాబాద్, ములుగు,మధిర,నల్గొండ,కొత్తగూడెం బ‌స్టాండ్లలో త్వ‌ర‌లో ఆధునీక‌ర‌ణ ప‌నులు మొద‌లు కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *