చంద్రబాబు ఏపీకి అన్యాయం చేస్తున్నారు
(అమరావతి,న్యూస్ఇన్)

ఏపీ ముఖ్యమంత్రి పై ప్రతిపక్ష పార్టీ నేతలు మండి పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు భయపడి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీకి న్యాయం చేసే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఓటు కు నోటు కేసులో పట్టుబడడంతోనే కేసిఆర్ సీఎంగా ఉన్నన్న రోజులు బాబు సైలెంట్ గా ఉన్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో కేసీఆర్కు భయపడి, ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు నోరు మెదపలేదన్నారు.శ్రీశైలం ఎడమ గట్టు పవర్ ప్రాజెక్టు హ్యాండోవర్ చేసుకుంటుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడలేకపోయారన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కోసం శిష్య వాత్సల్యంతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేశాడు ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ తెలంగాణా శాషనసభలో చెప్పారన్న విషయాన్ని మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇప్పటి వరకు తెలంగాణా కే పరిమితమైన కృష్ణా జలాల వార్ ఏపీకి చేరుకుంది.






Leave a Reply