పార్టీ పదవుల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ
అన్ని వర్గాలకు సముచిత స్థానం
(హైదరాబాద్,న్యూస్ఇన్)

గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి ఎన్నికలను నిర్ణీత గడువుకే పూర్తి చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. పార్టీ పదవుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తలు స్వీకరిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో భారీగా ఆశావహులు పదవుల కోసం నామినేషన్లు ఆన్ లైన్ ద్వారా సమర్పిస్తున్నారు. డీసీసీ పరిధిలోని అన్ని 44 డివిజన్ల వారీగా ఎన్నికల సన్నాహాలపై చర్చించేందుకు త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు ఖాలీద్ సైఫుల్లా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తుందన్నారు.
పట్టణ ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు, ఉచిత బియ్యం పంపిణీ వంటి పథకాలు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెంచుతున్నాయన్నారు. ఈ పథకాలతో పాతబస్తీ ప్రజల్లో 70 శాతం మంది ప్రత్యక్షంగా లాభపడుతున్నారని తెలిపారు.గత ప్రభుత్వంలో పాతబస్తీ అభివృద్ధి మాటలకే పరిమితం అయిందని, పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతుండడం అభివృద్ధి పనులకు నిదర్శనంగా నిలుస్తున్నాయాన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు ఇచ్చేందుకు సహకరిస్తాయని సైఫుల్లా ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ దృష్టి కేవలం ఎన్నికలపై మాత్రమే కాకుండా అభివృద్ధిపై కూడా ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం, హైదరాబాద్ డీసీసీ కార్యవర్గ సభ్యుల తుది జాబితా త్వరలోనే ప్రకటిస్తామని ఖాలిద్ వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా చేస్తామని,ఏఐసిసి సూచనలకు అనుగుణంగా అన్ని వర్గాలకు అవకాశం కల్పించేలా కార్యవర్గాన్ని ఖరారు చేస్తామన్నారు.






Leave a Reply