బీజెపి అధ్యక్షులు రాంచందర్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)

గ్రామీణ ప్రాంతప్రజలకు ఉపాధికల్పించే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందిన బీజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ ఆరోపించారు. నిరుపేదలకు నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) – VB-G RAM G యాక్ట్-2025 ను సవరించిందన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర రాంచందర్ రావు గారి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్ , పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, తదితర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సమా వేశంలో మాట్లాడిన రాంచందర్ రావ్ వంద రోజులు పనిదినాలుంటే ఇప్పుడు 125 రోజులుగాకేంద్రం మర్చిందన్నారు. బీజెపీని,ప్రధాని మోడీని లక్ష్యంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ చట్టంపై ప్రజల్లో అపోహలు, అపార్థాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల కుట్రలను క్షేత్ర స్థాయిలో తిప్పి కొట్టాల్సిన బాధ్యత బీజెపి కార్యకర్తలపై ఉందని రాంచందర్ రావ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, అవి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేయాలని పార్టీ నేతలకు,కార్యకర్తలకు సూచించారు.







Leave a Reply