NewsInn

News in a Click

రుణ‌మాఫీ చేయాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించిన రైతు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన రుణ‌మాఫీ పై ఓ రైతు న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వం త‌న రుణ‌మాఫీ చేయ‌డం లేద‌ని హై కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీఓ లో
రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు ఉన్నా….రుణమాఫీ కాలేదని పిటీష‌న్లో ఆ రైతు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో తెలంగాణ హైకోర్టు విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *