NewsInn

News in a Click

విద్యా వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేస్తున్నారు

యూనివ‌ర్సిటీ భూముల‌పై కాజేసే య‌త్నం

కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు చూపు లేకుండా విద్యా వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేస్తోందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ,ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై ‘మిషన్ మోడ్’లో పనిచేస్తోందన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు పరం చేసేందుకు.. అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గిన విష‌యాన్ని గుర్తు చేశారు.

ప్ర‌స్తుతం హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రఖ్యాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసింది. యూనివర్సిటీలోని 50 ఎకరాలను వెనక్కు తీసుకుని మళ్లీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింద‌ని విమ‌ర్శించారు. యూనివర్సిటీల వద్ద భూమి ఉంటే.. అది వర్సిటీల భవిష్యత్ అవసరాలకోసం, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు ప్రభుత్వ ఖజానాను నింపేందుకు వీటిని వాడుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కిష‌న్ రెడ్డి వ్య‌క్తం చేశారు.

ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడం.. యూనివర్సిటీ భూములను ఆర్థిక దోపిడీకి వాడుకోవడంపైనే రేవంత్ రెడ్డి సర్కారు ఆసక్తి చూపిస్తోంది.. తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ, వర్సిటీల పురోగతిని మాత్రం అంధకారంలోకి నెట్టేస్తోందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *