- సీ ఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) డావోస్ 2026 సమావేశాల్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను, అలాగే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు రూపొందించిన CURE, PURE, RARE ఫ్రేమ్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
గత రెండేళ్లు దావోస్ పర్యటనల సందర్భంగా, ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో వచ్చిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.‘A Spirit of Dialogue’ అనే థీమ్తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాలు 2026 జనవరి 19 నుంచి 23 వరకు డావోస్లో జరగనున్నాయి.గతంలో వచ్చిన పెట్టుబడుల పురోగతిని సమీక్షించి, పెండింగ్లో ఉన్న అంశాలు లేదా అడ్డంకులను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన మూడు దిశల ఆర్థిక వృద్ధి వ్యూహాన్ని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించి, రాష్ట్ర అభివృద్ధి రోడ్ మ్యాప్ను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో ప్రధానంగా ఫోకస్ చేయనుంది.







Leave a Reply