పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించడం తగదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా మంత్రిపై నిరాధార కథనాలు వస్తుండడం హాస్యాస్పందంగా ఉందన్నారు. కొంత మంది నేతలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోందని, ఇది వారికి కూడా మంచిదని జగ్గారెడ్డి హితవు చెప్పారు. ఇలాంటి వార్తలు రాయించే వారు ఎవరైనా ఉంటే వారు బయటకు వచ్చి ఈవిషయాలు చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇలాంటి సంప్రదాయం మంచిదికాదన్నారు. తెలంగాణా రాజకీయాల్లో ఉన్న ఒక చరీశ్మ ఉన్న నేతగా కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి గుర్తింపు దక్కించుకున్నారన్నారు. రాజకీయాలను ఎన్ ఎస్ యు ఐ నుంచి మొదలు పెట్టి యువజన కాంగ్రెస్ నేతగా, మంత్రి అంచెలంచెలుగా కష్ట పడి ఈ స్థాయికి వచ్చిన నేతపై ఇలాంటి ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. వ్యక్తగతంగా టార్గెట్ చేసి వార్తలు ప్రచారం చేస్తున్నా….చేసినా దీని వల్ల ప్రయోజనం లేదన్నారు. అయితే మీడియా కూడా ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు. ఓ మంత్రిగా సంబంధిత అధికారితో మాట్లాడితే కూడా ఇలా తప్పుబట్టడం భావ్యం కాదన్నారు. ఇలాంటి ప్రచారం వల్ల మహిళా అధికారుల మానసిక స్థైర్యం కూడా దెబ్బతింటుందన్నారు.








Leave a Reply