మున్సిపల్ ఎన్నికలకు సన్నధం అవుతున్న జనసేన
త్వరలో రంగంలోకి పవన్ కళ్యాణ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
అతి త్వరలో తెలంగాణాలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతుంది. పార్టీ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. జనసేన పార్టీని సంస్థాగతంలో బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీని సంస్థా గతంగా బలోపేతం చేసేలా కమిటీలు వేస్తామని వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతి జనసైనికుడు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని కోరుతోంది. త్వరలో ఎన్నికల కార్యాచరణను వెల్లడిస్తామని పార్టీ ప్రకటించింది. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణాలో పర్యటించి పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను అభినందించారు. ఈ సందర్బంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని పార్టీ నేతలు కోరడంతో పార్టీ అదినేతగా పవన్ కళ్యాణ్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి తరువాత పవన్ కళ్యాణ్ మున్సిపోల్స్ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఏపీలో బీజీపీ తో కలిసి కూటమి అధికారం దక్కించుకోవడంతో…ఇక్కడ జనసేన బీజెపీతో కలిసి పోటీ చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనసేన ప్రకటన కొత్త రాజకీయ సమీకరణకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.సంక్రాంతి అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణా ఎన్నికల రంగంలో దిగే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగే తెలంగాణాలో రాజకీయం మరింత రంజుగా మరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏపీలో బీజెపి, టీడీపి కూటమి ప్రభుత్వం కొనసాగుతుండడంతో తెలంగాణాలో జనసేన పార్టీ వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల బరిలో దిగుతామని జనసేన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కూడా హాట్ హాట్ మారింది.








Leave a Reply