NewsInn

News in a Click

అస్తిత్వంపై దెబ్బ‌కొడితే చూస్తూ ఊరుకోము

అస్తిత్వంపై దెబ్బ‌కొడితే చూస్తూ ఊరుకోము

సికింద్రాబాద్ ముక్క‌లైతే….రాజ‌కీయంగా సీఎం ను ముక్క‌లు చేస్తాం

త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రిక‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సికింద్రాబాద్ అస్తిత్వంపై దెబ్బ‌కొడితూ తాము చూస్తూ ఉరుకునేది లేద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు. అధికారం ఉంద‌ని సీఎం ఈ నిర్ణ‌యం తీసుకుంటే రాజ‌కీయంగా సీఎం రేవంత్ రెడ్డిని ముక్క‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. సికింద్రాబాద్ కు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని, ఈ చరిత్ర‌ను క‌నుమరుగు చేయాల‌ని సీఎం రేవంత్ పావులు క‌దిపితే తాము చూస్తూ ఉరుకోమ‌న్నారు. సికింద్రాబాద్ కార్పోరేష‌న్ ఏర్పాటు డిమాండ్ చేస్తూ క‌లిసి వ‌చ్చిన రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాల‌తో క‌లిసి ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను త‌ల‌సాని రూపొందిస్తున్నారు. అధికారం ఉంద‌ని ఇష్టాను సారంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. సికింద్రాబాద్ ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌కొట్టే విధంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే తామూ ఆందోళ‌న‌ల‌ను తీవ్రం చేసి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా ఉద్య‌మాన్ని తీవ్రం చేస్తామ‌న్నారు.

రాజ‌కీయం ఎప్పుడూ ఉంటుంద‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో చెల‌గాటం అడితే స‌హించేది లేద‌న్నారు. హైద‌రాబాద్ ను డీలిమిటేష‌న్ చేయ‌డాన్ని తాము త‌ప్పు ప‌ట్ట‌డం లేద‌ని క‌నీసం మేయ‌ర్, క‌మిష‌నర్ల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా డిలీమిటేష‌న్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి పేర్లు మార్చే అధికారం ఎవ‌రిచ్చార‌ని త‌ల‌సాని ప్ర‌శ్నించారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ నుంచి గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు శాంతియుతంగా యాత్ర చేప‌డుతామ‌ని, ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో మార్పు లేక‌పోతే ద‌శ‌ల‌వారిగా ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌ని త‌ల‌సాని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *