NewsInn

News in a Click

న‌డిగ‌డ్డ‌లో మ‌రోసారి రెచ్చిపోయిన ఎంపీ మ‌ల్లు ర‌వి

న‌డిగ‌డ్డ‌లో మ‌రోసారి రెచ్చిపోయిన ఎంపీ మ‌ల్లు ర‌వి

కొబ్బరికాయ కొట్టడానికి ఎవడ్రా నువ్వు….!

ద‌ళిత ఎమ్మెల్యేపై ద‌ళిత ఎంపీ ఉగ్ర‌రూపం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా రాజ‌కీయాల్లో వివాదాస్ప‌దంగా మారిన ప్రోటోకాల్ వ్య‌వ‌హారం మ‌రోసారి తీవ్ర దూమారం రేపుతోంది. బీఆర్ ఎస్ శాస‌న‌సభ్యులుగా విజ‌యం సాధించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈస‌మ‌స్య ఎక్కువ‌గా తెర‌పైకి వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారే ప్ర‌భుత్వకార్య‌క్ర‌మాల్లో అధికారికంగా పాల్గొనే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం త‌ర‌చూ ఈ వివాదాలు అన్ని ప్రాంతాల్లో తెర‌పైకి వ‌స్తున్నారు. గ‌తంలో ఈ వ్యవ‌హారం అసెంబ్లీని కుదిపేసినా….తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. ఎంపీ మ‌ల్లు ర‌వి ఎమ్మెల్యే ఉన్నా….. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కు కొబ్బ‌రి కొట్టాల‌ని సూచించ‌డంతో ఎమ్మెల్యే విజేయుడు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాను ఇక్క‌డే ఉన్నా ప్రోటోకాల్ లేని వ్య‌క్తుల‌కు ఎలా అవ‌కాశం ఇస్తారంటూ ఎంపీని నిల‌దీయ‌డంతో….. ఎంపీ మ‌ల్లు ర‌వి ఒక్క సారిగా రెచ్చి పోయారు. ఎమ్మెల్యే అనే క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌కుండా ఎంపీ రెచ్చి పోయిన తీరు స్థానికుల‌ను ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ఎమ్మెల్యే విజేయుడును దుర్భాష‌లాడుతూ…దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో ఒక్క సారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణ చోటు చేసుకుంది. అయితే ఈ వ్య‌వ‌హారంపై మ‌ల్లు ర‌వి వ్య‌వ‌హారం మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారింది. గ‌తంలో గ‌ద్వాల ఎమ్మెల్యేతో మ‌ల్లు ర‌వి దురుస‌గా ప్ర‌వ‌ర్తించిన సంఘ‌ట‌న‌ను స్థానిక నేత‌లు గుర్తు చేస్తున్నారు. గ‌ద్వాల ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణ‌మోహ‌న్ రెడ్డి బీఆర్ ఎస్ లో విజ‌యం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరినా….గ‌ద్వాల ఎమ్మెల్యే తో కూడా మ‌ల్లు ర‌వి దురుసుగా గ‌తంలో వ్య‌వ‌హ‌రించిన తీరును స్థానిక నేత‌లు గుర్తు చేస్తున్నారు. న‌డిగ‌డ్డ‌లో గ్రూపు రాజ‌కీయాల‌ను ప్రోత్సహిస్తున్న మ‌ల్లు ర‌వి వ్య‌వ‌హారంపై కొంత మంది కాంగ్రెస్ నేత‌లు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది ప్ర‌జాస్వామ్యంపై జరిగిన దాడి….కేటిఆర్

అయితే ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ ఎస్ నేత‌లు మ‌ల్లు ర‌వి వ్య‌వ‌హారాన్ని త‌ప్పు బ‌ట్టారు. పార్టీ వ‌ర్కింగ్ కేటిఆర్, బీఆర్ ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీష్ రావ్ లు ఖండించారు. అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా అభివ‌ర్ణించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమ‌న్నారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్ధం అవుతుంది…ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి.సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి.ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలి.
బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *