(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలుగు మీడియా సంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిషేధం విధిస్తూ నిర్ణయం వెల్లడించింది.ఆ సంస్థకు చెందిన ఛానల్ లో ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్ ను అవమాన పరచడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమభరత్ ప్రకటన విడుదల చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ ప్రతినిధులను ఆహ్వానించరాదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ఆ సంస్థ చర్చలకు ఆహ్వానించినా వెళ్లరాదని పార్టీ నేతలను ఆదేశించింది.ఏబీఎన్ సంస్థ ముందు నుంచి తెలంగాణా వాదానికి వ్యతిరేకంగానే పనిచేస్తూ బీఆర్ ఎస్ ను, పార్టీ నేతలను అవమాన పరచడం అనవాయితీగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి విడతలో కూడా రెండు మీడియా సంస్థలపై ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా నిషేధించింది. ఆతరువాత జరిగిన పరిణామాలతో మెత్తబడింది. తాజాగా మరోసారి ఏబీఎన్ చర్యను నిరసిస్తూ బీఆర్ ఎస్ నిర్ణయం తీసుకుంది.







Leave a Reply