NewsInn

News in a Click

గవర్నర్ ను కలవనున్న భారత రాష్ట్ర సమితి నేత‌లు

సింగరేణి కుంభకోణంపై ఫిర్యాదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

గ‌త కొద్ది రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారిన సింగ‌రేణి కుంభ‌కోణంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బీఆర్ ఎస్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టే విధంగా మ‌రో అడుగు ముందుకు వెయ‌నుంది. సింగ‌రేణి కుంభ‌కోణంపై గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను క‌లిసి బీఆర్ ఎస్ ఫిర్యాదు చేయ‌నుంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వ‌ర్యంలో నేత‌లు మంగ‌ళ‌వారం గ‌వ‌ర్న‌ర్ తో భేటీ కానున్నారు.

ఈ భేటీ సందర్భంగా, సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు.సాయంత్రం 4 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ను బీఆర్ ఎస్ నేత‌లు క‌లువ‌నున్నారు.అంత‌కు ముందు తెలంగాణా భ‌వ‌న్ నుంచి నేత‌లంతా క‌లిసి లోక్ భ‌వ‌న్ కు వెళ్ల‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *