(అమరావతి,న్యూస్ ఇన్)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జనగ్మోహన్ రెడ్డి రెండు రోజులుగా తన సొంత గ్రామంలో గడుపుతున్నారు. మంగళవారం పులివెందుల చేరుకున్న ఆయన ప్రజలను కలుపుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది సేపటిక్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో రీతిగా మాట్లాడుతూ అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.













Leave a Reply