NewsInn

News in a Click

బ్రూవ‌రీస్ కేటాయింపులో కుంభ‌కోణ‌మే

బ్రూవ‌రీస్ కేటాయింపులో కుంభ‌కోణ‌మే

మాజీ మంత్రి హ‌రీష్ రావ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ‌లో మ‌రో కుంభ‌కోణానికి తెర‌లేపింద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. తెలంగాణా భ‌వ‌న్ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మ‌ట్లాడిన ఆయ‌న ప్ర‌భుత్వంలో పెద్ద‌లు సెటిల్ చేసుకున్న ప‌ర్సెంటేజీలు అంటూ లెక్క‌లు బ‌య‌ట‌పెట్టారు. మెద‌క్ జిల్లాలో రైతుల‌కు క్రాప్ హాలీడే ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం బ్రూవ‌రీస్ కంపెనీల‌కు నీళ్లు కేటాయించేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. రాష్ట్రంలో 25 మైక్రో బ్రూవ‌రీస్ కంపెనీల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని, ఒక్కో కంపెనీ వారిగా కీల‌క నేత‌లు వాటాలు సెటిల్ చేసుకున్నార‌ని హ‌రీష్ ఆరోపించారు. మైక్రో బ్రూవ‌రీస్ కోసం రాష్ట్రంలో 110 ద‌ర‌ఖాస్తుల వ‌చ్చాయ‌ని వాటిలో 25 కంపెనీల‌కు ముందుగా అనుమ‌తులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. మంత్రి కోటాలో నాలుగు, ముఖ్య‌నేత కోటాలో 21 కంపెనీలు కేటాయించాల‌ని అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని హ‌రీష్ వెల్ల‌డించారు. ఒక్కో బ్రూవ‌రీ అనుమ‌తి కోసం 1.80 కోట్ల ధ‌రను నిర్ణ‌యించార‌ని, దీంట్లో కోటి రుపాయ‌లు ముఖ్య‌నేత‌కు కాగా….30 ల‌క్ష‌ల రుపాయ‌లు ముఖ్య‌నేత‌కు తోడుగా ఉంటున్న‌నేత‌కు అన్న చందంగా ప‌ర్సెంటేజీలు కూడా ఫిక్స్ అయ్యాయ‌న్నారు. సంబంధిత మంత్రి త‌న కోటా నాలుగు కంపెనీల‌ను కూడా ఫైన‌ల్ చేసుకున్నార‌న్నారు. మ‌ద్యం దుకాణాల‌కు లాట‌రీ ప‌ద్ధ‌తి ద్వారా కేటాయించిన ప్ర‌భుత్వం బ్రూవ‌రీ అనుమ‌తులు ఇచ్చేందుకు కూడా లాట‌రీ విధానాన్ని అవ‌లంభిస్తే తప్పేమిట‌ని హ‌రీష్ రావ్ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం త‌న చిత్థశుధ్ది నిరూపించుకోవాలంటే లాట‌రీ ద్వారానే బ్రూవ‌రీల‌ను కేటాయించాల్సిన అవ‌స‌రం దున్నారు.

మ‌ద్యం దుకాణాల్లో స్టాక్ పై ఎఫెక్ట్….

ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మ‌ద్యం స‌ర‌ఫరాలో కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని హ‌రీష్ రావ్ వ్యాఖ్యానించారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా కంపెనీల‌కు ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో కొన్ని కంపెనీలు మ‌ద్యం స‌ర‌ఫ‌రా నిలిపివేస్తామ‌ని హెచ్చ‌రిక చేశాయ‌న్నారు. వాటాల పంప‌కాల్లో తేడా రావ‌డంతోనే నిధుల చెల్లింపు నిలిచిపోయింద‌ని హ‌రీష్ ఆరోపించారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా దారుల‌కు 4,500 కోట్ల రుపాయాలు బకాయి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌డింద‌ని, ప్ర‌ముఖ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు కూడా మ‌ద్యం స‌ర‌ఫ‌రాను ఆపివేసేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని త‌న‌కు స‌మాచారం అందుతుంద‌న్నారు. గ‌తంలోనే మ‌ద్యం హాలో గ్రాం టెండ‌ర్ల‌లో మంత్రి కుమారుడికి, ముఖ్య‌నేత అల్లుడికి వాటాల పంచాయ‌తీ జ‌ర‌గ‌డంతో ఆ ప్ర‌భావం ఉన్న‌తాధికారుల‌పై ప‌డిన విష‌యాన్ని హ‌రీష్ రావ్ గుర్తు చేశారు. మెద‌క్ జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద 40 వేల ఎక‌రాలు ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎలాంటి ఆటంకం లేకుండా బీరు కంపెనీ లకు నీటిని ప్ర‌భుత్వం పంపిణీ చేస్తోంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *