ప్రమాణ స్వీకారం చేసిన సునేత్ర పవార్
(న్యూఢిల్లీ, న్యూస్ ఇన్)
మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా దివంగత ఎన్సీపీ నేత అజీత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా సునేత్ర పవార్ ను ఎన్సీపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. దీంతో ఆమెను ఉపముఖ్యమంత్రిగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర ఉప ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ఎన్సీపీ అధినేతగా ఉన్న అజీత్ పవార్ దుర్మరణం చెందారు. ఆజీత్ పవార్ రాజకీయ వారసురాలిగా సునేత్రకు మద్దతుగా ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. చీలిక వర్గం బలంగా ఉండాలంటే సునేత్ర పవార్ ఆధ్వర్యంలోనే పార్టీ ముందుకు వెళ్లాలని నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సునేత్రకు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూ వస్తున్నారు. తన భర్త దుర్మరణం చెందడంతో ఆ స్థానంలో సునేత్రకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. తపనయుడు పార్థీవ్ పవార్ కు కూడా రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరిగే రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో పార్థీవ్ పవార్ పేరు చేరనుంది.




Leave a Reply