NewsInn

News in a Click

తిరువ‌నంత‌పురంలో భార‌త్ బ్యాట‌ర్ల మెరుపులు

టీ -20 ల్లో భార‌త జ‌ట్టు భారీ స్కోరు

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్‌)

తిరువ‌నంత పురంలో సాయంత్రం 7 గంట‌లకు మొద‌లైన ఐదో టీ-20 లో భార‌త బ్యాట‌ర్లు న్యూజీలాండ్ బౌల‌ర్ల‌పై త‌మ ప్రతాపం చూపారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త జ‌ట్టు ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతామ‌న్న సంకేతాలు ఇచ్చింది. మొద‌టి ఓవ‌ర్ నుంచే ఓపెనర్లు భారీ స్కోరు ల‌క్ష్యంగా బ్యాటింగ్ మొద‌లు పెట్టారు. అభిషేక్ శ‌ర్మ‌, సంజుశాస‌న్ లు ఇన్నింగ్స్ ప్రారంభించారు. 3 ఓవ‌ర్ల‌లో 31 ప‌రుగులు సాధించిన ఓపెన‌ర్ల‌లో సంజుశాంస‌న్ మ‌రోసారి నిరాశ ప‌రుస్తూ తొలి వికెట్ గా వెనుదిరిగారు. ఐదో ఓవ‌ర్ వ‌చ్చే వ‌ర‌కు స్కోరు 48 ప‌రుగులకు చేరుకుంది ఆ స‌మ‌యంలో అభిషేక్ శ‌ర్మ కూడా అవుట్ కావ‌డంతో భారీ స్కోరుకు బ్రేకులు ప‌డ్డాయ‌న్న సందేహం క‌లిగింది. కానీ ఈ సారి అభిషేక్ శ‌ర్మ రోల్ ను ఇషాన్ శ‌ర్మ తీసుకున్నారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో న్యూజీలాండ్ బౌల‌ర్ల‌పై పూర్తి ఆధిప‌త్యం చ‌లాయించారు. ఇషాన్ కు కెప్ట‌న్ సూర్య తోడు కావ‌డంతో ర‌న్ రేట్ అన్యూహంగా పెరుగుతూ వ‌చ్చింది. వీరి భాగ‌స్వామ్యం 14.3 ఓవ‌ర్ల‌కు వెళ్ల‌డంతో పాటు స్కోరు 185 ప‌రుగులకు చేరుకుంది. ఆ స‌మ‌యంలో సూర్య‌కుమార్ యాద‌వ్ 30 బంతుల్లో 63 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.

సెంచ‌రీకి స‌మీపంలో ఉన్న ఇషాన్ త‌న దూకుడును కొన‌సాగిస్తూ సెంచ‌రీ మార్క్ ను చేరుకున్నారు. 43 బంతులో 103 ప‌రుగులు చేసిన ఇషాన్ 10 సిక్స‌ర్లు, 4 ఫోర్లు కొట్టారు. 239.53 ర‌న్ రేట్ తో న్యూజీలాండ్ బౌల‌ర్ల‌కు ఎక్క‌డా అవ‌కాశం ఇవ్వ‌కుండా విరుచుకు ప‌డ్డారు. సెంచ‌రీ త‌రువాత భారీ షాట్ ఆడే ప్ర‌య‌త్నంలో ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్ప‌టికే క్రీజ్ లో కుదురుకున్న హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించారు. 17 బంతుల్లో 42 ప‌రుగులు చేశారు.20 ఓవ‌ర్లు పూర్త‌య్యే వ‌ర‌కు రింకూసింగ్, శివ‌మ్ దుబేలు 8, 7 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు. భార‌త ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 23 సిక్స‌ర్లు ఉన్నాయి.నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భార‌త జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 271 భారీ ల‌క్యాన్ని న్యూజీలాండ్ ముందు ఉంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *