ఆకట్టుకున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీ
విద్యార్థుల కోసం మినీ రాజ్యంగం పుస్తకం అవిష్కరణ
( అమరావతి, న్యూస్ ఇన్)
చట్టాలు చేయడం ముఖ్యం కాదు.. వాటిని పాటించడం ముఖ్యం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని విద్యార్థుల మాక్ అసెంబ్లీ అభిప్రాయపడింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’ పేరుతో జరిగిన జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజ్యాంగ విలువలు, అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ తరహాలోనే విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఎం.లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా సౌమ్య, డిప్యూటీ సీఎంగా కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా చిన్మయి, స్పీకర్ గా స్వౌతి వ్యవహరించారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థి ప్రతినిధులు అన్నీ తామై ముందుండి నడిపించారు. బిల్లులు ఎలా పాస్ చేస్తారు, పాస్ చేసిన బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది, ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుంది, అధికార పక్షం ఎలా వ్యవహరిస్తుందో ఈ మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు తెలియజెప్పారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముందుగా ప్రొటెం స్పీకర్, స్పీకర్ ఎన్నిక జరిగింది. సభలోకి ప్రొటెం స్పీకర్ రాగానే సభ్యులందరూ లేచి నిలబడ్డారు. కొత్తగా అసెంబ్లీ కొలువు దీరిన సందర్భంగా అనురించే విధనాలనే విద్యార్థులు అనుసరించారు.

జీరో అవర్ నిర్వహణ
స్పీకర్ ఎన్నిక అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, మానవ వనరులు, పంచాయతీ రాజ్, విద్యుత్, రవాణ, హోం, క్రీడా, మహిళా శిశు సంక్షేమం, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి పది ప్రశ్నలు అడిగారు.
ఆయా ప్రశ్నలకు మంత్రులుగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. జీరో అవర్ లో తుఫాను సన్నాహాలు అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ మూడు నిమిషాల సమయం ఇచ్చారు.
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్ లైన్ భద్రత-సోషల్ మీడియా నియంత్రణ బిల్లు-2025, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025 బిల్లులు ప్రవేశపెట్టారు.
క్లాజ్ లపై ఓటింగ్ నిర్వహించారు. రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.

భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ
మాక్ అసెంబ్లీ అనంతరం పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థులందరితో కలిసి సీఎం, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం శాసనసభ, శాసనమండలి హాల్ ను మంత్రి లోకేష్ స్వయంగా విద్యార్థులకు చూపించారు.



Leave a Reply