
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో జరగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. అవును మేము చెబుతున్నది నిజమే…మీరు చదవుతున్నది నిజమే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాల్టీలకు ఇంచార్జ్ లను నియమించింది. గతంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జ్ ల నియమిస్తే…తాజాగా మరికొన్ని మున్సిపాల్టీలతో పాటు కార్పోరేషన్లకు ఇంచార్జ్ బాద్యతలు కొంత మంది నేతలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో బీఆర్ ఎస్ నుంచి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆరికపూడి గాంధీకి నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో బాద్యతలు అప్పగించింది. ఈ కార్పోరేషన్ లో టీ. జీవన్ రెడ్డి, బల్మూర్ వెంకట్,ఇరవత్రి అనిల్ కు కూడా బాధ్యతలు అప్పగించారు.

అధికారికంగా విడుదల చేసిన ఈ జాబితా బయటకు రావడంతో సోషల్ మీడియాలో గాంధీపై జోరుగా ట్రోలింగ్ జరుగుతోంది. పార్టీ మారిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తామంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేని అని చెబుతుండడంతో బీఆర్ ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీకి నేతలు లేక బీఆర్ ఎస్ నేతలకు ఇంచార్జ్ లు అప్పగించారని సైటైర్లు వేస్తున్నారు.
అరెకపూడీ గాంధీతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్ లకు కూడా ఇంచార్జ్ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ఇటీవల ఈ ఎమ్మెల్యేలు ఫిరాయింపు లకు పాల్పడలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ను ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే కాంగ్రెస్ మరోసారి వీరిని ఎన్నికల ఇంచార్జ్ లుగా నియమించడం కాంగ్రెస్ మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పని పరిస్తితి నెలకొంది.





Leave a Reply