NewsInn

News in a Click

హోలీకి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్లు

160 రైళ్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌ణాళిక‌

అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని రైళ్లు

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

ఉత్త‌రాదిన హోలీ పండుగ‌కు ఉన్న ప్రాధ‌న్య‌త నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే హైద‌రాబాద్ నుంచి 160 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికులకు ఈ ప్ర‌త్యేక రైళ్లు మార్చి నెల నుంచి అందుబాటులోకి తేవాల‌ని రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ నుంచి దేశం లోని వివిధ ప్రాంతాల‌కు ఈ ప్ర‌త్యే క రైళ్ల‌ను రైల్వే శాఖ నిర్వ‌హించ‌నుంది.

ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం, పాట్నా, రాజ్‌కోట్, సోలాపూర్, బిలాస్‌పూర్, దానాపూర్, రక్సౌల్, నహర్లగున్, హజ్రత్ నిజాముద్దీన్, షాలిమార్, హిసార్, లక్నో, సంత్రాగచి, మాల్డా టౌన్, ఛప్రా మరియు అనేక ఇతర ముఖ్యమైన గమ్యస్థానాల వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి. ఈ అన్ని గమ్యస్థానాల నుండి తిరుగు ప్రయాణాలను కూడా ప్లాన్ చేశారు, రెండు వైపులా ప్రయాణించే ప్రయాణీకులకు పండ‌గ సీజ‌న్ దృష్టిలో ఉంచుకుని న‌డిపించ‌నున్నారు.గ‌త ఏడాది రైల్వే శాఖ 1144 ట్రిప్పులు నిర్వ‌హించ‌గా ఈ ఏడాది 1500 ట్రిప్పులు నిర్వ‌హించేందుకు అనుగుణంగా అధికారులు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *