
మాజీ ఎంపీ కవిత
(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎంపీ కవిత మరోసారి విరుచుకు పడ్డారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం అని మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోయిందని కవిత స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు వద్దంటూ కోర్టుకెక్కిన మాధవ రెడ్డి ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. బీసీలను రిజర్వేషన్లను వ్యతిరేకించే మాధవ రెడ్డి హరీష్ రావ్ కనుసన్నలోలనే నడుచుకుంటారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై బీఆర్ ఎస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ లు గా నియమించారని, బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే అయితే కాంగ్రెస్ ఇంచార్జ్ లుగా ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. అరికపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్ లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని స్పీకర్ ఇటీవలే తీర్పు వెల్లడించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి అన్న చందంగా ఉందని, రాహూల్ గాంధీకి రాజ్యంగంపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హద్దులు దాటి మట్లాడుతున్నారని ఇది భావ్యం కాదన్నారు. తెలంగాణాలో రాజకీయాలు హుందాగా ఉండాలని కోరుకుంటున్నానని కవిత వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ ఓ సీరియల్ గా సాగుతుందన్నారు.
12న ఉద్యమ కారుల ఆత్మగౌరవ సభ….
ఈ నెల 12 వ తేదీన తెలంగాణా ఉద్యమ కారుల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు కవిత వెల్లడించారు. తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణా ఉద్యమకారులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. 12వ తేదీన సభకు సంబంధించి జాగృతి నేతలతో కలిసి కవిత ఆవిష్కరించారు.







Leave a Reply