NewsInn

News in a Click

చెప్పుల దొంగకు ఎందుకు ఓట్లేయాలి

అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుంటే ఏం లాభం

ఆ పార్టీలను గెలిపిస్తే… అంతే

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులెత్తుకుపోయే దొంగ, ఆయనను ఎవరూ నమ్మడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘ఇది నామాట కాదు. రేవంత్ రెడ్డే చెప్పారు. ‘నాకు బజార్ల అప్పు పుట్టడం లేదు. నన్ను ఎవరూ నమ్మడం లేదు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు’ అని ఆయనే చెప్పారు. మరి అట్లాంటి చెప్పుల దొంగకు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలి? బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభం? నిధులు ఎక్కడి నుండి తీసుకొచ్చి అభివ్రుద్ధి చేస్తారు?’’అని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చ కాంగ్రెస్ నేతలను 6 గ్యారంటీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు వస్తే 10 ఏళ్ల పాలనలో ప్రజలను దోచుకుతిన్నారు. ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నించాలని కోరారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా క‌రీంన‌గ‌ర్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ప్రసంగిస్తూ సీఎంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే ఇంటి పన్నులు పెంచుతారు. నల్లా ఛార్జీలు పెంచుతారు. కరెంట్ ఛార్జీల పెంపు ఖాయం. అదే బీజేపీకి ఓట్లేస్తే మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పన్ను పెంచకుండా కేంద్రం నుండే నిధులు తీసుకొచ్చి కరీంనగర్ కు మరింత అభివ్రుద్ధి చేస్తా. మొన్ననే కేంద్రం కరీంనగర్ కార్పొరేషన్ కు రూ.50 కోట్లు ఇచ్చింది. ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం నుండి రూ.134 కోట్లు తీసుకొచ్చిన. ఆ డబ్బులతో కరీంనగర్ ను మరింత అభివ్రుద్ధి చేస్తా. నిరంతరాయంగా ఇంటింటికీ నీళ్లు ఇస్తా. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేస్తే ఆ నిధులను దారి మళ్లిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *