దొంగ పాస్ పోర్టులు- దొంగనోట్ల చరిత్ర ను కాపాడుతా
- పరిగిలో సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు వేడెక్కతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పై బీఆర్ ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయనే ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. పరిగిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ ఎస్ పై నిప్పులు చెరిగారు. శుక్రాచార్యుడు ఫాం హౌస్ నుంచి రాక్షులను జనాల్లోకి వదిలి అభివృద్ధిని అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మారీచుడు, సుబాహులు అదే పనిపై ఉన్నారని విమర్శించారు. కేసిఆర్ కు నోటీసులు ఇస్తే పెద్ద రాధ్దాంతం చేస్తున్నారని,ట్యాపింగ్ లాంటి చిల్లర పనులు చేస్తే నోటీసులు ఇవ్వకుండా ఏమిస్తారని ప్రశ్నించారు. కేసిఆర్ చరిత్రను చరిపేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్, కేటిఆర్ లు విమర్శిస్తున్నారని కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపి వేయలేరన్నారు. కేసీఆర్ దొంగ పాస్ పోర్టుల చరిత్ర చెరిపేస్తే చెరిగేదా అని ప్రశ్నించారు. దొంగనోట్ల కేసు ఉందని ఆర్ ఎస్ ప్రవీణ్ చెప్పారు అది నేను చెరిపేస్తే పోతుందా అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ దొంగహామీల చరిత్ర నేను చెరిపితే పోతుందా?పదేళ్ల మీ దోపిడీ చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరని సీఎం బీఆర్ ఎస్ అధినేత పై ఘాటుగా విమర్శలు చేశారు.తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం మీ పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోదని,ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాదే అని ప్రకటించారు.

రాష్ట్రంలో పదేళ్లు కేసిఆర్, 12 ఏళ్లు మోడీ ప్రధానిగా ఉన్నారని అయినా రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. మోదీని చూసి ఓటేస్తే గల్లీలో ఉండే బోడిగాడు పనిచేయకపోతే ఢిల్లీకి వెళ్లి అడగాలా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు వాళ్ల బీ ఫామ్ బీఆరెఎస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆరెస్ వి చీకటి ఒప్పందాలతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మీరు ప్రజా సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజలు బీఆర్ ఎస్, బీజేపీలకు ఓట్లు వేసేవారని ఇప్పుడు ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం మీకు ఉండేది కాదని ఆ రెండు పార్టీలపై సీఎం ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారామని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి చెప్పి…. మరి చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి అనుమతులు ఎందుకు తీసుకురాలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి బీఆర్ ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని సీఎం కోరారు.







Leave a Reply